త్రివిక్రం దర్శకత్వంలో వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచిన 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయారు. కారణం ఆయన రాజకీయాల్లోకి వెల్లడమే. అయితే గత ఎన్నికల సమయంలో పవన్ ఇక సినిమాలు చేయడం లేదంటు ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చాడు. దాంతో అందరు ఇక పవన్ సినిమాలు వదిలేశాడని అనుకున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దిల్ రాజు, అల్లు అరవింద్ కలిసి పవన్ తో సినిమాను మొదలుపెట్టించబోతున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ పింక్ సినిమా రీ మేక్ లో పవన్ నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాను పవన్తోనే ఎందుకు చేయాలనుకుంటున్నారో తాజాగా బోనీ కపూర్ వెల్లడించారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా 'పింక్' సినిమాను శ్రీదేవి కోరిక మేరకు తమిళ నటుడు అజిత్తో కోలీవుడ్ లో 'నేర్కొండ పార్వాయ్' టైటిల్తో రీమేక్ చేశాను. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ని అందుకుంది. దాంతో ఈ సినిమాని తెలుగులో తీసినా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం కలిగింది. అందుకే ఈ సినిమాను తెలుగులో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఆయన్ను ఒప్పించాను.. అని వెల్లడించారు.
పింక్ సినిమా ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న కథలను ఎన్నిసార్లు రీమేక్ చేసినా మంచి సక్సస్ ను సాధిస్తాయి. అయితే స్క్రీన్ ప్లే విషయంలో నేటివిటీకి తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కొన్ని లక్షల మంది అభిమానులకు పవన్ ఆదర్శం కాబట్టి.. ఇలాంటి సినిమాలో పవన్ను లాయర్గా చూడబోతున్న ఫ్యాన్స్కు పింక్ రీమేక్లో ఓ కానుకనే చెప్పాలి. ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.