టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు కావాలని వచ్చి హీరోలుగా మారిన సంఘటనలు ఉన్నాయి. రవితేజ, నాని టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్లుగా వచ్చారు..లక్కితో నటులుగా మారారు. ఇదే బాటలో ‘ఉయ్యాలజంపాల’ సినిమాతో హీరోగా మారాడు రాజ్ తరుణ్. మొదట చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్ట్ చేసిన రాజ్ తరుణ్ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా మారాడు. అదృష్టం బాగుండి తదుపరి సినిమా సినిమా చూపిస్త మావ, కుమార్ ఎఫ్ 21, ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఇలా కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అందించాయి.
గత ఏడాది లవర్ సినిమాతో వచ్చినా అది హిట్ టాక్ తెచ్చుకోలేపోయింది. తాజాగా దిల్ రాజు సమర్పణలో..రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన ‘ఇద్దరిలోకం ఒకటే’ (యూ ఆర్ మై హార్ట్ బీట్) ట్యాగ్ లైన్. జి.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీత మందిస్తున్నారు. అభిమానులకు దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక రాజ్ తరుణ్కు ‘కుమారి 21 ఎఫ్’తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్, ఈ సినిమా తనకి బ్రేక్ ఇస్తుందనే హోప్తో ఉన్నాడు. కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : తమ్మిరాజు, మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్, మాటలు : అబ్బూరి రవి, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి - బెక్కెం వేణుగోపాల్.