‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
ఇటువంటి క్రమంలో సోషల్ మీడియాలో తాజాగా అనిల్ సుంకర.. 'ఆగడు'తరహాలో మంచి హైప్ రావాలని కోరుకుంటున్నారు. ‘ఆగడు’కు బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ. ఓవర్సీస్ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిందని.. ప్రిమియర్లతోనే 5 లక్షల డాలర్ల మార్కును అందుకున్న తొలి తెలుగు సినిమా అదేనని అనీల్ సుంకర చెప్పారు. ‘సరిలేరు నీకెవ్వరు’కు ‘ఆగడు’ స్థాయి హైప్, ‘దూకుడు’ తరహా కంటెంట్ ఉండాలని తాను కోరుకుంటున్నాను.. మీరేమంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ అభిమానుల్ని ప్రశ్నించాడు అనీల్.
'ఆగడు' సినిమా విడుదలయి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అనిల్ సుంకర ఈ ట్వీట్ చేయడం విశేషం. కాగా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో చాలా శరవేగంగా సాగుతోంది. హీరోయిన్ గా ఈ సినిమాలో రష్మిక మందన నటించగా...సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది. కాగా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో…..లేదో చూడాలి.