బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలకి ముందే నాగార్జున తడాఖా !
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కి వచ్చిన స్పందన చూసి సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ షాకింగ్ కామెంట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ గమనిస్తే నాగార్జున గత చిత్రాలు 30 కోట్ల లోపు ఉండేది. కాని ఈసారి మాత్రం ఏకంగా 50 కోట్లను క్రాస్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్లో కీర్తి సురేష్ మరియు సమంతలు కూడా కనిపించబోతున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలతో పాటు విదేశీ మోడల్స్ కూడా చాలా మంది ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇందుమూలంగా నీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.