తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలు నిర్మించిన దిల్ రాజు గత సంవత్సరం అపజయాలతో సతమతమయ్యారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం మంచి సక్సెస్ తో భారీ కలెక్షన్ల వసూళ్లు దిశగా సాగుతుంది. ప్రస్తుతం అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీలు సంయుక్తంగా వంశి పైడి పల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, పూజా హేగ్డె ముఖ్యపాత్రలో ‘మహర్షి’చిత్రం నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. అయితే ‘మహర్షి’చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ మద్య చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
ఈ రూమర్లపై స్పందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘మహర్షి’చిత్రం ఏప్రిల్ 25 న రిలీజ్ చేయబోతున్నామని..ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ రూమర్లు..అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.