సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మద్య ప్రేమ పుట్టడం పెళ్లి చేసుకోవడం జరుగుతుంది..అయితే అది రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది. తెలుగు లో ఆ మద్య నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త్వరలో రణ్ వీర్ కపూర్, దీపికా పదుకొనె పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా మరో జంట కూడా పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా..అలియాభట్, రణ్ బీర్.
కత్రినా కైఫ్ తో విడిపోయిన తర్వాత..రణ్ బీర్ అలియాకు దగ్గరయ్యాడన్నది బీ టౌన్ టాక్. వీరి బంధానికి రెండు కుటుంబాలు కూడా సుముఖంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్ బీర్ తండ్రి హీరో రిషికపూర్ మాట్లాడుతూ..కొడుకు పెళ్లిచేసుకుని పిల్లల్ని కంటే..వారితో కలిసి ఆడుకోవాలనుకుంటున్నానని రిషి కపూర్ చెప్పాడు.
తాను 27 ఏళ్లకే పెళ్లిచేసుకుని జీవితంలో స్థిరపడ్డానని, రణ్ బీర్ వయసు ఇప్పుడు 35 అని, కచ్చితంగా అతను పెళ్లి గురించి ఆలోచించాల్సిన సమయమిదని రిషి కపూర్ వ్యాఖ్యానించాడు. తనకిష్టమైన వ్యక్తిని ఎవరినైనా రణ్ బీర్ పెళ్లిచేసుకోవచ్చని, తల్లిదండ్రులుగా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు. మనవలు, మనవరాళ్లతో కలిసి ఆడుకోవాలన్నది తన కోరికని తెలిపాడు.
రణ్ బీర్ పెళ్లి చేసుకుంటానని చెబితే.. అది తమకు ఎంతో సంతోషకరమైన విషయమవుతుందని, తమ సంతోషం అంతా...కొడుకు ఆనందం మీదే ఆధారపడి ఉందని రిషి అన్నాడు. సోషల్ మీడియాలో అలియా, రణ్ బీర్ తల్లి నీతూకపూర్ ఇద్దరూ ఒకరిని ఒకరు పొగుడుకుంటూ ఉంటారు కూడా. ఈ విషయాలన్నింటినీ రిషికపూర్ వద్ద ప్రస్తావించగా...వారిద్దరి మధ్య ఏముందో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే అన్నారు. ప్రస్తుతం వారిద్దరూ 'బ్రహ్మాస్త్ర' సినిమాలో కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా విడుదల అవుతుంది.