హీరోయిన్ గా నాకేం తక్కువ : అనసూయ

siri Madhukar
బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.  జబర్ధస్త్ లోనే కాకుండా ఇతర ఛానల్స్ లో యాంకర్ గా సత్తా చాటుతుంది. ఈ అమ్మడి అదృష్టం కలిసి వచ్చి అక్కినేని నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నానయ’తో వెండితెరపై కూడా తన ప్రస్థానం మొదలు పెట్టింది. 

ఒకటీ రెండు సినిమాల్లో నటించిన అనసూయ ఈ మద్య సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రత్తమ్మత్తగా నటించి దుమ్మురేపింది.  ఒకదశలో చిట్టిబాబు గా రాంచరణ్, రామలక్ష్మిగా సమంత లకు ఎంత పేరు వచ్చిందో..రంగమ్మత్తగా అనసూయ క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది.  దాంతో ఇండస్ట్రీలో అనసూయకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 

ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై నటిస్తుంది. తాజాగా హీరోయిన్‌కు తానేమీ తక్కువ కాదని.. అసలు ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళా హీరోయినే అని హాట్ యాంకర్‌ అనసూయ వ్యాఖ్యానించింది. తాజాగా ఆమె విశాఖపట్నంలో ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించి మీడియాతో ముచ్చటించింది.

తాను ఎక్కడికి వెళ్లినా రంగమ్మత్త అని పిలుస్తున్నారని, చాలా ఆనందంగా ఉందని అనసూయ తెలిపింది.ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. రంగస్థలంలో రంగమ్మత్తలా మంచి పాత్రల్లో కనబడుతూ గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: