ఎన్టీఆర్ ని అందుకే వద్దన్నా..!

siri Madhukar
సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ హీరోలకు ప్రత్యేక స్థానం ఉంది. మహానటులు ఎన్టీఆర్ వారసులుగా ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  బాలకృష్ణ హీరోగా, ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా..హరికృష్ణ సినిమాలకు ఎప్పుడో దూరం అయ్యారు.  ఆ మద్య ఒకటీ రెండు సినిమాలు తీశారు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన తనయులు నందమూరి కళ్యాన్, ఎన్టీఆర్ లు హీరోలుగా కొనసాగుతున్నారు. 

తాజాగా ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ కి మద్య విభేదాలు వచ్చాయని..అందుకే ఎమ్మెల్యే' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు తారక్ వస్తాడని ఫ్యాన్స్ భావించినా మనోడు డుమ్మా కొట్టాడు. దీంతో వీరిద్దరి మద్య ఏమైనా తేడాలు వచ్చాయా అన్న అనుమానాలు తలెత్తాయి. తాజాగా ఈ విషయంపై కళ్యాన్ రామ్ స్పందిస్తూ..త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడని, లుక్ ను మొత్తం మార్చేసుకున్నాడని చెప్పాడు.

ఒకవేళ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు తారక్ వస్తే, అతని లుక్ అవుట్ అవుతుందని... అందుకే ఫంక్షన్ కు రావద్దని తానే చెప్పానని తెలిపాడు. ఎన్టీఆర్ తాజా లుక్ చూసి తాను కూడా చాలా హ్యాపీ ఫీలయ్యానని తెలిపాడు. వాస్తవానికి ‘ఎమ్మల్యే’ ఫ్రీరిలీజ్ ఫంక్షన్ గురించి మేము ఇద్దరం మాట్లాడుకున్నామని ఆ సమయంలో తానే కల్పించుకుని, ఫీల్ అవద్దని చెప్పానని అన్నాడు.

తామిద్దరం ప్రొఫెషన్ ను చాలా సీరియస్ గా తీసుకుంటామని తెలిపాడు. తారక్ విషయంలో తన స్వార్థం తాను చూసుకోకూడదని భావించానని... అతని కష్టాన్ని తాను తీసేసుకోకూడదని అనుకున్నానని చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: