నా కూతురు హీరోయినా..? అవన్నీ పుకార్లు : గౌతమి

Edari Rama Krishna
ఈ మద్య సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ నీటిమీద బుడగలా తయారయ్యాయి.  కొన్ని న్యూస్ లు ఇట్టే వైరల్ అవుతూ..సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి.  చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ సినిమా ఇప్పుడు ఇతర భాషల్లో కూడా తీయడానికి ఉత్సాహం చూపుతున్నారు.  బాలీవుడ్ లో ఈ సినిమాపై క్లారిటీ లేకున్నా తమిళంలో మాత్రం ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ సినిమాగా రిమేక్ అవుతుంది. 

ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఆ మద్య విక్రమ్ ఇచ్చారు. తన తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని..ధృవ్ ‘అర్జున్ రెడ్డి’లా తయారవుతున్నాడని ఆ మద్య పోస్ట్ చేశాడు.  అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయంపై ఎన్నో కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లను సెలక్ట్ చేసినా ఎవరూ సెట్ కావడం లేదట.

తాజాగా ధృవ్ సరసన ప్రముఖ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి ఎంపిక జరిగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది.  తెలుగు .. తమిళ భాషల్లో సీనియర్ కథానాయికగా గౌతమికి మంచి పేరుంది. ఈ మధ్యనే ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తోంది.  తాజాగా ఈ విషయం పట్ల గౌతమి స్పందించారు.

సుబ్బులక్ష్మి దృష్టి పూర్తిగా చదువుపైనే ఉందనీ, యాక్టింగ్ వైపుకు వెళ్లే ఆలోచన ఆమెకి లేదని చెప్పారు. ఆ దిశగా ఎలాంటి ప్లాన్ చేయలేదనీ .. ప్రస్తుతం జరుగుతున్నదంతా కేవలం ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. సుబ్బులక్ష్మికి ఆశీస్సులను అందజేస్తోన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
 Taken aback to see news about my daughter's acting debut. Subhalaxmi is committed to her studies and has no plans for acting now. Thank you all for your blessings on her.
— Gautami (@gautamitads) March 13, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: