పవర్స్టార్ పవన్కళ్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాపై టాలీవుడ్ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ చివరి రెండు సినిమాలు సర్దార్ గబ్బర్సింగ్, కాటమరాయుడు డిజాస్టర్ అయినా ఈ సినిమాకు రూ. 120 కోట్లకు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు త్రివిక్రమ్ వరుస హిట్లతో ఉండడంతో ఈ సినిమాకు అదిరిపోయే బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నటించే నెక్ట్స్ సినిమా కూడా రెడీ అవుతోంది. కందిరీగ, రభస, హైపర్ సినిమాల డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ సినిమాకు పవన్ ఓకే చెప్పాడు.
ఈ సినిమాలో నటించేందుకు పవన్ 40 రోజుల కాల్షీట్లు ఇచ్చాడట. ఈ 40 రోజులు షూటింగ్లో పాల్గొన్నందుకు గాను పవన్ రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అంటే పవన్కు రోజుకు కోటి రూపాయల రెమ్యునరేషన్ గిట్టుబాటు అవుతుంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ టాలీవుడ్ హిస్టరీలోనే ఇంత వరకు ఏ హీరో తీసుకోలేదు. కోలీవుడ్లో విజయ్ హీరోగా నటించి హిట్ అయిన ఓ సినిమా మూలకథను తీసుకుని దానిని తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారట.
ఇక సెప్టెంబర్లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాలో రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ యేడాది చివర్లో లేదా వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.