ఈ మద్య లగ్జరీ జీవితాలకు అలవాటు పడిన వారు చేయకూడని తప్పులు చేస్తూ నేరస్తులుగా మారుతున్నారు. ఇక డబ్బు మాత్రమే పరమావధిగా భావించి దాని కోసం ఎంతకైనా తెగించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. కేవలం ఐచ్ఛిక సుఖాల కోసం కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి నిర్దాక్షిణ్యంగా చంపించింది ఓ భార్య.. ఈ దారుణ సంఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..కన్నడి టివి నటి కల్పన(27) భర్తతో కలిసి బెంగుళూర్ లో నివసిస్తుంది. కొంత కాలం వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే గత కొంత కాలంగా కల్పనకు జావేద్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది.
కాగా భర్త సతీష్ (36) ఓ ప్రయివేట్ సెక్యూరిటీ సంస్థ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. భర్త లేని సమయంలో జావేద్ వచ్చిపోవడం వీరి విలాసానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. అయితే ఈ విషయం కాస్త భర్త సతీష్ కు తెలియడంతో వార్నింగ్ ఇచ్చాడు . దీంతో తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని తెలుసుకొని ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యింది.
ప్లాన్ ప్రకారం భర్త కు నిద్ర మాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత జావేద్ ని పిలిచి భర్తని కిరాతకంగా చంపేసింది. ఎలాగూ కల్పన నటి కావడంతో తన భర్త చనిపోయాడంటూ అందరినీ ఎంతో ఈజీగా నమ్మించాలని చూసింది..అంతే కాదు తన భర్త చావుకు కారణం ఎవరో తెలుసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన పద్దతిలో కల్పనను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. ప్పుడు టివి నటి కల్పన తో పాటు ఆమె ప్రియుడు కూడా కటకటాల వెనక్కి వెళ్లారు.