మనీ : 4500/- తో నెలకు 51000 పొందోచ్చు..

Purushottham Vinay
మనం డబ్బులు సంపాదించే సమయంలోనే మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొంత మొత్తం పొదుపు చేస్తే చాలా మంచిది.సంపాదించే సమయంలోనే డబ్బుని పొదుపు చేయకపోతే అనేక ఇబ్బందులు తప్పవు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో డబ్బులను పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు.మీకు 25 సంవత్సరాల వయస్సు నుంచే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ గా మీరు పొందవచ్చు.మీకు 25 సంవత్సరాల వయస్సు వున్నప్పుడు నుంచి నెలకు 4,500 రూపాయలను ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయ్యాక 10 శాతం వడ్డీతో 51,682 రూపాయలు పెన్షన్ గా పొందవచ్చు. ఇక ఈ స్కీమ్ లో ఎంత ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ మొత్తం పెన్షన్ మీరు పొందవచ్చు.

మీరు ఈ ఎన్‌పీఎస్‌లో రూ.4,500 ప్రతి నెలా పెట్టుబడి పెడితే మీకు 60 సంవత్సరాల వయస్సు వచ్చేనాటికి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం కూడా 18.90 లక్షల రూపాయలు అవుతుంది.ఇక ఈ మొత్తం డబ్బుకి 10 శాతం చక్రవడ్డీని లెక్కిస్తే 60 సంవత్సరాలకు గాను మీకు కోటీ 72 లక్షల రూపాయలు అవుతుంది. ఈ మొత్తం డబ్బులో 60 శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం మీకు ఉండగా 40 శాతానికి యాన్యుటీ ప్లాన్ ను కొనుగోలు చేస్తే చాలా మంచిది. 40 శాతం డబ్బును విత్ డ్రా చేస్తే 60 శాతానికి యాన్యుటీ ప్లాన్ ను కొనుగోలు చేయాలి. ఇక మీరు కనుక ఇలా చేస్తే నెలకు 51,682 రూపాయల పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ చెప్పవచ్చు.ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు ఇంకా అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలలో ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.ఆసక్తి వున్న వారు వెంటనే ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: