చరణ్ దీపావళి షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
రామ్ చరణ్ దాదాపు రెండు నెలల పాటు టాలీవుడ్ దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉండకుండా ఫారిన్ టూర్ ప్లాన్ చేసాడు అనే వార్తలు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. చాలామంది దర్శకులు ఎన్నో కధలు తనకు చెపుతున్నా ఏ సినిమా కధకు ముందు ఓకే చేయాలో తెలియని పరిస్థితులలో ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో సినిమాలేవీ లేక పోవడంతో చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని ఫిలిం నగర్ టాక్. ఈ రెండు నెలల సమయాన్ని పూర్తిగా విదేశాల్లో గడపాలనుకుంటున్నాడట ఈ మెగా పవర్ స్టార్. ఈ విదేశీ యాత్రలో రామ్ చరణ్ వెంట ఆయన భార్య ఉపాసన కూడా వెళ్ళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు నెలల హాలిడే పూర్తయిన తర్వాత మాత్రమే రాంచరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడనే విషయాన్ని ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం.  ఈ వార్తలే నిజం అయితే చరణ్ కు అనేక కధలు వినిపించి అతడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న చాలామంది దర్శక నిర్మాతలకు ఇది దీపావళి షాకింగ్ న్యూస్ అనుకోవాలి. చరణ్ ఇంత హడావిడిగాఈరెండు నెలల విదేశీ పర్యటన చేయడానికి తీసుకున్న నిర్ణయం వెనుక తాను ఆశించిన మెగా హిట్ ను ‘గోవిందుడు అందరివాడేలే’ అందివ్వక పోవడమే అనే మాటలు కుడా ఉన్నాయి.  ఏమైనా మేగా కాంపౌండ్ చుట్టూ తిరిగే దర్శక నిర్మాతలకు కొంతకాలం విశ్రాంతి దొరికిందనే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: