"ప్రాజెక్ట్ కే" మూవీకి అతను సంగీత దర్శకుడు కాదు... అశ్వినీ దత్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటు వంటి అశ్విని దత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అశ్విని దత్ "వైజయంతి మూవీస్" బ్యానర్ పై ఎన్నో సంవత్సరాలుగా ... ఎన్నో మూవీ లను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాతలలో ఒకరిగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అశ్విని దత్ తాజాగా తన బ్యానర్ పై సీతా రామం అనే మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా అశ్విని దత్ బ్యానర్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అశ్విని దత్ ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్నటువంటి ప్రాజెక్ట్ కే అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు అశ్విని దత్ సొంత అల్లుడు అయినటువంటి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ ... దిశా పటాని ఈ మూవీ లో ఇతర ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అశ్విని దత్ ప్రకటించాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అశ్విని దత్ "ప్రాజెక్ట్ కే" మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతన్ని ఇవ్వడం లేదు అని ... సంతోష్ నారాయణ ఈ సినిమాకు సంగీతం ఇవ్వడానికి ఎంపిక అయ్యాడు అని అధికారికంగా ప్రకటించాడు. ఇలా తాజాగా అశ్విని దత్ ప్రాజెక్ట్ కే మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధించిన అప్డేట్ ను తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: