పాన్ ఇండియా లెవెల్ లో చరణ్ -బుచ్చిబాబు కాంబో.... నిజమా...??

murali krishna
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉప్పెన మూవీ తో తన ఫస్ట్ సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు తన తదుపరి మూవీకు చాలా టైం తీసుకున్నాడు.ఐతే మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలి అనుకోగా అది కాస్త పట్టాలు ఎక్కలేదు.
ఐతే తారక్ అంత ఇమేజ్ ఉన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు దర్శకుడు బుచ్చి బాబు. ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ పతాకంలో చరణ్, బుచ్చి బాబు కాంబో మూవీ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.ఐతే ఆ అనౌన్స్మెంట్ అనేది వచ్చి కూడా చాలా కాలం అవుతున్నా మూవీ కు సంబంధించిన న్యూ అప్డేట్ మాత్రం రాలేదు.ఐతే ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు.
ఆ మూవీ పూర్తి చేశాక చరణ్ తన పదహారో సినిమా లైన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయినా పూర్తి కావాల్సి ఉన్నా అది కూడా జరగట్లేదు అని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.ఉప్పెన మూవీ హిట్ కొట్టగానే ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ అని చూడకుండా చరణ్ బుచ్చి బాబుతో పాన్ ఇండియా లెవెల్ లో మూవీ చేస్తున్నాడు. ఐతే చరణ్ కొద్దిగా డేర్ చేసాడనే చెప్పాలి.స్టార్ ఇమేజ్ ఉన్నా హీరో న్యూ డైరెక్టర్ కి పాన్ ఇండియా లెవెల్ మూవీ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే చాలా ఆలోచించాలి కానీ రాం చరణ్ మాత్రం ఇలాంటివేవి ఆలోచించకుండా కొత్త డైరెక్టర్స్ ను కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనే ధోరణి కల వ్యక్తి అని దీన్ని బట్టి తెలు స్తుంది.ఐతే రామ్ చరణ్ మరియు చిరు అభిమానులు మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: