సమంత పై ఫైర్ అయిన అక్కినేని హీరో.. అదే కారణమా..!??

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. మొదట ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె దాని అనంతరం మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ సినిమాల్లో నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోగా నటించాడు .ఈ సినిమా షూటింగ్ చేసే టైంలో నాగచైతన్య సమంత మధ్య ప్రేమ చిగురించడంతో ఎన్నో రోజులు వీరు ప్రేమని రహస్యంగా ఉంచి దాని అనంతరం ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

 పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాల దాకా ఎంతో బాగున్న ఈ జంట ఎవరు ఊహించిన విధంగా విడాకులు ప్రకటించారు. ఇక విడాకులు జరిగి సంవత్సరం గడుస్తున్న ఇంకా ఎందుకు విడాకులు తీసుకున్నారు  అనేది ఎవరికీ తెలియదు. అయితే తాజాగా సమంత పై నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఫైర్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి .అయితే సమంత విడాకుల తర్వాత మరింత జోష్ పెంచి సినిమాలలో బిజీగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సమంత సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అధిక వర్కౌంట్స్ చేసి డైటింగ్  చేయడం వల్ల మయోసైటిస్ అనే వ్యాధి వచ్చింది.

 ఈ వ్యాధి కోసం ఇండియాలో అనేక చికిత్సలు తీసుకొని మెరుగని చికిత్స కోసం దక్షిణ కొరియాకు వెళ్లిందట సమంత. ఇక ఈమె మయోసైటిస్ వ్యాధి బారిన పడిందని తెలిసిన చాలామంది సెలబ్రిటీలు అభిమానులు సైతం ఈమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఇక ఎవరు ఊహించిన విధంగా అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ కూడా కామెంట్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అక్కినేని అఖిల్ సమంత పై కోప్పడినట్లుగా తెలుస్తుంది. మా అన్నయ్యతో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. విడాకులు తీసుకోవడంతో ఒంటరి అయిపోయిన సమంత ఆరోగ్యం పై దృష్టి పెట్టకుండా సినిమాల మీద ఫోకస్ పెట్టి ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంది. మళ్లీ తను ఆ వ్యాధి నుండి బయట పడాలంటే కచ్చితంగా ఆమెకు ఒక తోడు కావాలి. ఇలాంటి కష్ట సమయంలో అన్నయ్య పక్కన ఉంటే బావుంటుంది అని అక్కినేని అఖిల్ చెప్పాడు .దీంతో చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: