ప్రభాస్ సందీప్ వంగా వర్కౌట్ అయ్యేలా లేదా!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్న ఈ దర్శకుడు మళ్ళీ తెలుగులో సినిమా చేయడానికి ఎంతటి సమయం పట్టిందని చెప్పాలి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రెండవ సినిమాను చేస్తున్నాడు సందీప్ రెడ్డి.

రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ దర్శకుడు ఆ తర్వా త ప్రభాస్ లాంటి ఫ్యాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తూ ఉండడం విశేషం. రష్మిక మందన ఈ యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ విధంగా సందీప్ రెడ్డి వంగా ఈ యానిమ ల్ సినిమా చేసి న తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుబోయే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మరికొన్ని రోజులు లేట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయట. 

ప్రభాస్ హీరోగా చాలా సినిమాలే ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో ముందుగా ఆది పురుష చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కాబోతుంది ఆ తరువాత ఆయన మారుతి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక ప్రశాంత నీల్ దర్శకత్వంలోని చిత్రం కూడా చిత్రీకరణ చేసుకుంటుంది. ఇంకొక వైపు ఈ మూడు సినిమాల్లో మాత్రమే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ప్రాజెక్టు కే సినిమా కూడా రూపుదిద్దుకుంటుంది. ఆ విధంగా ఈ నాలుగు సినిమాలను పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రభాస్ సినిమా మొదలుపెట్టే సమయానికి సందీప్ రెడ్డి ఖాళీగా ఉండడం ఇష్టం లేకపోతే వేరే హీరోతో వెళ్ళవలసి ఉంటుంది. మరి ఈ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగా ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: