ఆది పురుష్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా ఆది పురుష్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా త్రీడీలో రూపొందించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్ర బృందం తాజాగా టీజర్ ను విడుదల చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ టీజర్ చాలామంది ప్రభాస్ అభిమానులకు నచ్చింది
అయితే కొంతమందికి ఈ టీజర్ నచ్చకపోవడం పై చాలా ఇష్యూ నడిచింది. టీజర్ చిన్నపిల్లల యానిమేషన్ సినిమా చూసినట్లుగా ఉందని సినిమా కూడా అలానే ఉంటే తప్పకుండా ఆదిపురష్ ప్రభాస్ కు మరొక ఫ్లాప్ తీసుకువస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చాలామంది విమర్శలు చేశారు. అయితే వెంటనే 3d టీజర్ ను విడుదల చేసి ప్రభాస్ ఆ సినిమాపై వచ్చిన నెటివిటీని కొంత తగ్గించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే ఈ సినిమా యొక్క నెగిటివ్ టాకీ బాగా ప్రబలిపోయింది.
దాంతో ఈ సినిమాపై అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనే విధమైన వార్తలు వినిపించగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రభాస్ అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఇప్పటికీ బాగా మాట్లాడుకోవడం ఈ సినిమా నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పవచ్చు. దీంతో ఈ చిత్రంపై ఎలాంటి నెగెటివిటీ లేదని స్పష్టంగా తెలుస్తుంది. ప్రభాస్ అభిమానులు సైతం వీరిని హైలెట్ చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాముడుగా ప్రభాస్ నటిస్తుంటే సీతగా ప్రతిసారి నటిస్తూ ఉండగా రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. మరి ఇప్పటికే రెండు భారీ పరాజయాలతో ప్రేక్షకులలో అసహనాన్ని మూటకట్టుకున్న ప్రభాస్ ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని తిరిగి కంబ్యాక్ చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: