జబర్దస్త్` యాంకర్గా రష్మి గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఆమె ఇప్పుడు `బజర్దస్త్`తోపాటు `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలకు యాంకర్గా చేస్తుంది. `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా తనే యాంకర్. ప్రస్తుతం మూడు షోలతో బాగా సంపాదిస్తుంది. ఇదిలావుంటే ఇటీవల అనసూయ `జబర్దస్త్` ని వీడి మరో షోకి వెళ్లిపోవడంతో ఆ బాధ్యతని రష్మినే చూస్తుంది. ఈ షోపై అనసూయ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈమె డబుల్ మీనింగ్ డైలాగ్లతో, బాడీ షేమింగ్ కామెంట్లకి గురవుతున్నట్టు తెలిపింది.ఇదిలావుంటే ఇక తాజాగా నెటిజన్లు యాంకర్ రష్మిపై పలు షాకింగ్ కామెంట్లు చేశారు.ఇక ఆ చెత్త షో చేయడం ఎందుకు మంచి సినిమాలు చేసుకోవచ్చుగా అంటూ పోస్ట్ పెట్టారు.
అయితే రష్మి శుక్రవారం సాయంత్రం నెటిజన్లతో ఛాట్ చేసే క్రమంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొంది.ఈమె... `జబర్దస్త్` షోలను అడల్ట్ కంటెంట్లకు కేరాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక దీనికి స్పందించి రష్మి.ఈమె అదిరిపోయే కౌంటర్లిచ్చింది.రష్మీ...సినిమాలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తన వద్ద చాలా స్క్రిప్ట్ లు ఉన్నాయని, నువ్వు సినిమాని నిర్మించేందుకు సిద్ధమైతే చెప్పు, తాను టీవీ షోస్ వదిలేసి సినిమాలు చేస్తానంటూ దిమ్మతిరిగే కౌంటరిచ్చింది.ఇక దీంతో నోరెళ్లబెట్టడం సదరు నెటిజన్ వంతవడం విశేషం.ఇదిలా వుండగా మరోవైపు `జబర్దస్త్` షోలు చూసి చిన్న పిల్లలు పాడవుతున్నారంటూ కామెంట్లు చేసిన నెటిజన్లకి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పింది రష్మి.
ఇక ఈ షో ద్వారా తాము ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నామని చెప్పింది. అయితే చిన్న పిల్లలు 9 వరకు పడుకుంటారని, ఆ తర్వాతనే ఈ షో వస్తుందని చెప్పింది.ఐకపో ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి వద్ద ఫోన్ ఉంటుందని, అందులో కావాల్సిన అడల్ట్ కంటెంట్ ఉంటుందని, మరి దాన్నిఎలా అడ్డుకుంటారని ఎదురు ప్రశ్నించింది.అంతేకాదు `జబర్దస్త్` షో పై తనకు రెస్పెక్ట్ ఉందని, వాటివల్లే ఇంతటి గుర్తింపు వచ్చిందని, అది ఎంతో మందికి లైఫ్ ఇస్తుందని పేర్కొంది.అంతేకాదు ఎంటర్టైన్మెంట్ అందించడంలో అది బెస్ట్ షో అని, తాము జెన్యూన్గా ఆడియెన్స్ కి వినోదాన్ని పంచే లక్ష్యంతోనే ఈ షోని నిర్వహిస్తున్నట్టు తెలిపింది రష్మి.ఇకపోతే ఈమె ఓ వైపు డాగ్స్ సమస్యలు, మరోవైపు టీవీ షోస్ పై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పింది రష్మి...!!