'యశోద' టీజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరో..!!

Anilkumar
టాలీవుడ్ స్టార్ అయిన హీరోయిన్ సమంత  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత  వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.సమంత జూలై నెల చివరి వారంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంది.ఇకపోతే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సమంత .. తాజాగా ఇప్పుడు  యశోద టీజర్‏తో యాక్టివ్ అయ్యింది. అయితే ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇకపోతే లేడి ఓరియెంటెడ్‏గా వస్తోన్న ఈ ను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

అయితే ఇక  ఫస్ట్ లుక్ పోస్టర్‏తోనే ఆసక్తిని రేకెత్తించిన చిత్రయూనిట్.. తాజాగా యశోద టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో సామ్ ప్రెగ్నెంట్ లేడీగా కనిపించింది. కాగా మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్ చెప్పగా.. అందుకు భిన్నంగా సమంతకు పరిస్థితులు ఎదురవుతుంటాయి.అయితే  యాక్షన్, ఎమోషన్స్ అండ్ థ్రిల్ అంశాలతో ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే తాజాగా ఈ టీజర్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ స్పందించారు.అయితే సమంత ట్వీట్‏ను రీట్వీట్ చేస్తూ.. మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను సామ్.... 

అంటూ క్యాప్షన్ ఇచ్చారు.కాగా  ఈ ను పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు హిందీలోనూ రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమాలో  సమంత మెయిన్ రోల్‏లో కనిపించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.అయితే  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోనే  కాకుండా సామ్.. ఖుషి చిత్రంలోనూ నటిస్తుంది. ఇక ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు అలాగే ఇప్పటికే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ విడుదల కావాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: