ఒకే వేదికపై మరోసారి మెగా బ్రదర్స్.. పండగే!

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో 'మెగాస్టార్‌' చిరంజీవి 'ఆచార్య' వంటి ఎపిక్ డిజాస్టర్ తరువాత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'.మలయాళంలో పెద్ద సూపర్‌ డూపర్ హిట్‌ అయిన 'లూసిఫర్‌' సినిమాకు రీమేక్‌గా ఈ గాడ్‌ ఫాదర్‌ సినిమా వస్తోంది. తమిళ డైరెక్టర్ మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక రాజకీయ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గాడ్‌ ఫాదర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ భారీగా సన్నాహాలు చేస్తోంది.'గాడ్‌ ఫాదర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా రానున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ఇప్పటికే చిత్ర యూనిట్ పవన్‌ను సంప్రదించగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారట. ఇదే నిజం అయితే చాలా రోజుల తర్వాత ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సందడి చేయనున్నారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


'గాడ్‌ ఫాదర్‌' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక టీజర్ అయితే సినిమాపై అంచనాలను మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. ఇక ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉంది. మెగాస్టార్ సరసన నయనతార నటించనుండగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, హీరో సత్య దేవ్, కమెడియన్ సునీల్ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.మరి ఆచార్య ఫ్లాప్ ని ఈ సినిమా భర్తీ చేస్తుందో లేదో చూడాలి.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: