ఇండియాతో పాటు పాకిస్తాన్... బంగ్లాదేశ్... శ్రీలంక లో కూడా నెంబర్ వన్ గా నిలిచిన మేజర్ మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ వున్న హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అడవి శేషు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ మూవీ లో  హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా , శోభితా ధూళిపాళ  , సాయి మంజ్రేకర్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు .
 

ప్రకాష్ రాజ్ మేజర్ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు . మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది . బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించి మంచి కలెక్షన్ లను రాబట్టిన మేజర్ సినిమా జూలై 3 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్  అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా మేజర్ సినిమా ప్రస్తుతం నేట్ ఫ్లిక్స్ ఇండియాలో ఒకటి మరియు రెండు స్థానాలలో కొనసాగుతోంది . 

ఇది ఇలా ఉంటే మేజర్ సినిమా కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , శ్రీలంక దేశాలలో కూడా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించిన మేజర్ సినిమా ప్రస్తుతం 'ఓ టి టి' లో కూడా అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకొని ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: