అనుష్క మూవీ అప్ డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటినుంచి అంటే?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అనుష్క తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు తెలుగు లో ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కేవలం గ్లామర్ పాత్రలో నటించడమే కాదు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక అరుంధతి అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు జేజమ్మ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో లేడీ క్వీన్స్ గా కొనసాగుతుంది అనుష్క శర్మ. సైజ్ జీరో  సినిమాతో కాస్త ప్రయోగం చూసి ఒక్కసారిగా లావెక్కింది. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది అనుష్క.

 అయినప్పటికీ భాగమతి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తెరమీదికి వచ్చింది. మరోసారి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వైవిధ్యమైన  సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ అనుష్క శెట్టి యువ హీరో నవీన్ పొలిశెట్టి ఒక సినిమా రాబోతుంది అని గత కొన్ని రోజుల క్రితం టాక్ అనిపించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్  కూడా బయటకి రాలేదు. దీంతో  ఈ క్రేజీ కాంబినేషన్ అసలు ఉంటుందా లేదా అన్నది ప్రేక్షకులందరిలో నెలకొన్న ప్రశ్న. ఇలాంటి సమయంలోనే అనుష్క మూవీకి సంబంధించి ఒక వార్త అభిమానులందరినీ కూడా ఆనంద పరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరోయిన్ అనుష్క శెట్టి  కాంబినేషన్లో శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా త్వరలో ప్రారంభం కాబోతుందట. ఈనెల 4వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది అని చిత్రబృందం తెలిపింది. మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. యు.వి.క్రియేషన్స్ ఇక ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఇక ఇందులో అనుష్క ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్ లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఈ సినిమాను తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: