వామ్మో.. శ్రీరెడ్డి కామెంట్స్ అలా ఉన్నాయా..?
నాగచైతన్యతో విడిపోయిన తరువాత ఇంతలా రికార్డింగ్ డ్యాన్స్ వేస్తూ.. సభ్య సమాజానికి సమంత ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసినది. అదేవిధంగా పొట్టిడ్రెస్సులు వేసుకుంటూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు పేర్కొన్నది. ముఖ్యంగా పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్తో మరొకసారి శ్రీరెడ్డి కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఊ అంటావా.. ఉహు అంటావా మావ అనే సాంగ్ పురుషులను కించె పరిచేవిధంగా ఉండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీరెడ్డి తన సంచలన ఆరోపణలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నది.
అదేవిధంగా శ్రీరెడ్డి రామ్గోపాల్ వర్మపై కూడా విరుచుకుపడ్డారు. సంబంధం లేని ప్రతిదాంట్లో నేను ఉన్నాను, నాకు కావాలి అని ఇండస్ట్రీలో ఎవరైనా పని పాటలేని, పనికిరాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా రామ్గోపాల్ వర్మనే అని పేర్కొన్నారు. పైకి వేదాంతిలా కనిపించినా ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే కచ్చితంగా రివేంజ్ తీర్చుకునే టైప్. తట్టుకోలేని మనిషి ఆర్జీవీ అని చెప్పుకొచ్చారు. పెద్ద మనిషిలా ఉంటూ ఏమి పట్టించుకోను అంటాడు. కానీ ప్రతి రోజు తన గురించి వార్తావిశేషాలు పోగు చేసుకుంటూ ఉంటాడు.
ఏరోజు అయినా తన గురించి వార్త రాకుంటే సంతోషంగా ఉండడు. వార్త క్రియేట్ చేయడానికి అకస్మాత్తుగా సన్నాయత్తం అవుతారు. అంతకు ముందు నేను దొరికాను. నాయుద్ధం చల్లార్చడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. బాలీవుడ్లో ఛీ.. తూ.. అంటే తట్టాబుట్టా సర్దేసుకుని మనోడు హైదరాబాద్ ఊపుకుంటూ వచ్చాడు. అక్కడ దరిద్రం వదిలిపోయింది. ఇక్కడ దరిద్రాలు సృష్టించాలి కదా సృష్టించకపోతే ఏ న్యూస్ రీడర్ కానీ, ఛానళ్లు కానీ పట్టించుకోవు. ముగ్గురు నలుగురిని తొత్తులుగా పెట్టుకొని అందులో దూరేసి నేనున్నానమ్మ అంటూ దూరిపోతాడు వర్మ అని పేర్కొంది. మొత్తానికి వివాదాలకు కేరాప్ అడ్రస్గా మారి ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనే ఆలోచనను తగ్గించుకుంటే చాలా మంచిది అన్నారు. ఇలా శ్రీరెడ్డి ఇప్పుడు సోషల్ స్టార్గా దూసుకుపోతున్నారు.