బెల్లంకొండ సరసన బాలీవుడ్ భామ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వి.వి.వినాయక్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా తెరకెక్కిన 'అల్లుడు శీను' సినిమా తో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఈ హీరో కు తెలుగులో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత సాక్ష్యం, స్పీడున్నోడు, కవచం, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా కూడా 2021 సంక్రాంతి కి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల్లుడు అదుర్స్' సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు, కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బెల్లంకొండ కు నిరాశనే మిగిల్చింది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును  తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో తన సత్తా చాటాలని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కే బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'చత్రపతి' సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచా ను ఎంపిక చేశారు. ఈ హాట్ బ్యూటీ పై రెండు రోజుల షూటింగ్ కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్యార్ కా పంచనామా 2`.. `సోను కే టిటు కి స్వీటీ`లో  నుస్రత్ బరుచా నటనను చూసిన తర్వాత వినాయక్ నుష్రత్ ని ఈ సినిమాకు ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నాడట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నుష్రత్ ల మధ్య మంచి కెమిస్ట్రీ పడుతుందనే ఉద్దేశంతో వి.వి.వినాయక్ ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: