సీటీమార్ డైరెక్టర్ తో మెగాస్టార్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సీటీమార్' వాయిదాలు పడుతూ ఎట్టకేలకు వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ సినిమా.ఇక ఈ సినిమా ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో డైరెక్టర్ సంపత్ నంది గురించి చిరూ మాట్లాడుతూ..'సంపత్ నంది మంచి కథకుడు.తాను రచ్చ సినిమా కథను నెరేట్ చేసిన విధానానికి ఫిదా ఐపోయానని చెప్పారు.ఇక కట్ చేస్తే త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో  ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లో విడుదలై సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా అటు గోపిచంద్ కి ఇటు సంపత్ నంది కి మంచి కం బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి.దీంతో డైరెక్టర్ సంపత్ నంది డబుల్ ఆనందంలో ఉండగానే..స్వయంగా చిరంజీవి సినిమా చేద్దాం అని చెప్పగానే సంపత్ నంది పట్టరాని సంతోషంతో గాల్లో తేలిపోతున్నాడట.ఇక సంపత్ నంది స్వయంగా మెగాస్టార్ కి అభిమాని కాగా..గతంలో 'రచ్చ' ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ..'ఇప్పటి నుంచి మా ఇంట్లో దేవుడి పటాల పక్కన చిరంజీవి గారి ఫోటో ఉంటుంది'..అని చెప్పి తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.మరి అలాంటి అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే ఆ ఆనందానికి అవధులే ఉండవు.

 ప్రస్తుతం సంపత్ నంది కూడా అదే స్టేజ్ లో ఉన్నాడు. అయితే త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక వరుణ్ సందేశ్ తో 'ఏమైంది ఈవేళ' అనే సినిమాతో డైరెక్టర్ గా అరంగేట్రం చేసిన సంపత్ నంది మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని రెండవ సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు.రామ్ చరణ్ తో 'రచ్చ' సినిమా తీసి మాస్ హిట్ అందుకున్నాడు.ఇక ఆ తర్వాత రవితేజ తో బెంగాల్ టైగర్,గోపిచంద్ తో గౌతమ్ నంద వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇప్పుడు మెగాస్టార్ తో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: