తమిళం వైపు దృష్టి పెడుతున్న ఎన్టీఆర్!!

P.Nishanth Kumar
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ప్రేక్షకులను తన నటనతో మరొకసారి అబ్బుర పరిచే విధంగా ఎన్టీఆర్ నటించబోతున్నాడని తెలుస్తుంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ వంటి చిత్రాలను చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని చూస్తున్నాడు. కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ ఆ మధ్య విడుదల కాగా ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది అని చెప్పవచ్చు. 

ఇక ఈ చిత్రం తర్వాత తను చేయబోయే సినిమాలను వాటి దర్శకులను ఇప్పటికే కన్ఫామ్ చేసేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి కాగానే జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన కొరటాల శివ తో ఎన్టీఆర్ చేతులు కలుపుతున్నాడు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. టాలీవుడ్ లో అందరు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా ఎన్టీఆర్ కూడా ఆ దిశగా రాజమౌళి సినిమా చేసిన తర్వాత రెండు సినిమాలను ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలతో పాటు గా మరొక సినిమాను కూడా తెరకెక్కించే విధంగా ప్రణాళికలు వేసుకున్నాడు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు చేసిన వెట్రిమారన్ ఇటీవలే ఎన్టీఆర్ కు ఓ మాస్ మసాలా కథను వినిపించగా దానిని ఓకే చేసే విధంగా ఎన్టీఆర్ ఉన్నాడట. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. దీంతో ఎన్టీఆర్ మూడు చిత్రాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: