బాలయ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుందా..?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖండ'.కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.బాలయ్య ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ అయిన అక్టోబర్ 13 న అఖండ విడుదల కాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.అయితే తాజా సమాచారం ప్రకారం ఏపీలో టికెట్ ధరల సమస్య పరిష్కారమైతే మాత్రమే అఖండ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం అఖండ రిలీజ్ విషయంలో బాలయ్య ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.ఇక మెగాస్టార్ చిరంజీవి దర్శకనిర్మాతలతో కలసి ఏపీ సీఎం జగన్ ను కలవాల్సి ఉన్నా..ఎప్పుడు కలుస్తారనే ప్రశ్నకు సమాధానమైతే ప్రస్తుతానికి దొరకడం లేదు.ఇక పాటలు మినహా అఖండ షూటింగ్ పూర్తయింది.ఇక మరోవైపు వచ్చే నెల నుంచే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో బాలయ్య నటించనున్నారు.

ఇక అక్టోబర్ నెలలో అఖండ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్న బాలయ్యకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీ లో టికెట్ రేట్ల సమస్య పరిష్కారం కోసం బాలయ్య ఎదురుచూస్తున్నాడు. మరి దసరా పండుగ సమయానికి ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇక త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే సినిమా నుండి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: