విశ్వనటభారతిగా, లేడీ అమితాబ్గా పవర్ ఫుల్ రోల్స్ ప్లే చేసిన నటి విజయశాంతి గురించి తెలుగు వారందరికీ తెలుసు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ విజయశాంతికి అభిమానులున్నారు. అయితే, ఆమె కెరీర్ పీక్స్ టైంలోనే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. అయితే, ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోయింది విజయశాంతి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న విజయశాంతి మహిళా నేతగా పాలిటిక్స్లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విజయశాంతికి ట్రిబ్యూట్గా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇందులో బుల్లితెర నటి రోహిణి ‘విజయశాంతి’గా అలరించింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఈ సందడికి వేదిక కాగా సుధీర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యహరించారు. ‘స్పెషల్ ట్రిబ్యూట్ టు విజయశాంతి’ పేరుతో ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పవర్ ఫుల్ పోలీసు పాత్రలు పోషించిన విజయశాంతి స్క్రీన్పై కనిపించగానే మహిళలకు ధైర్యం వచ్చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ’ ఇంకా పలు చిత్రాల్లో పవర్ ఫుల్ రోల్స్ ప్లే చేసిన విజయశాంతి.. మెగాస్టార్ చిరంజీవితో ‘గ్యాంగ్ లీడర్’ ఫిల్మ్లో గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్ ప్లే చేసింది.
‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’ చిత్రంలో ఫన్నీ పాత్రలో కనిపించగా, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో సీరియస్ రోల్ ప్లే చేసింది. ఈ ఐదు సినిమాల్లోని పలు సన్నివేశాలను రోహిణి తనదైన శైలిలో బుల్లితెరపై ఆవిష్కరించింది. మొత్తంగా రోహిణి తన ఫర్ఫార్మెన్స్తో బుల్లితెరపై మరో విజయశాంతి అనిపించుకుంది. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు సినిమాల్లో లేడీ సూపర్ స్టార్గా విజయశాంతి పేరుగాంచగా, బుల్లితెరపై లేడీ సూపర్ స్టార్ రోహిణి అని కామెంట్స్ చేస్తున్నారు. రోహిణి నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు.