చరిత్రలో ఈ నాటి ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే..
1686 వ సంవత్సరంలో బీజాపూరు రాజ్యం, ఔరంగజేబుతో యుద్ధంలో ఓడిపోయి, మొఘల్ సామ్రాజ్యం కలిసిపోవడం జరిగింది. ఆదిల్షాహీ వంశ పతనం కూడా జరిగింది.
చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..
1885 వ సంవత్సరంలో గౌస్ బేగ్ సాహెబ్ జన్మించడం జరిగింది. ఈయన పేరాలలో జరిగిన ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహంచేసి మునిసిపల్ శాసనాన్ని రద్దుచేయించడం జరిగింది.
1892 వ సంవత్సరంలో తల్లావఝుల శివశంకరస్వామి జన్మించడం జరిగింది. ఈయన ప్రసిద్ద సాహితీవేత్త ఇంకా భావకవితా ఉద్యమ పోషకుడు కూడా.
1920 వ సంవత్సరంలో పెరుగు శివారెడ్డి జన్మించడం జరిగింది. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.
1925 వ సంవత్సరంలో జోలెపాళ్యం మంగమ్మ జన్మించారు. ఈయన ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్.
1952 వ సంవత్సరంలో అల్లాబక్షి బేగ్ షేక్ జన్మించారు. ఈయన రంగస్థల రచయిత ఇంకా నటుడు.
ఇక చరిత్రలో ఈ నాడు జరిగిన మరణాల విషయానికి వస్తే..
2009 వ సంవత్సరంలో నార్మన్ బోర్లాగ్ మరణించడం జరిగింది. ఈయన హరిత విప్లవ పితామహుడు.
2009 వ సంవత్సరంలో రాజ్సింగ్ దుంగార్పూర్ మరణించడం జరిగింది. ఈయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు.
2010 వ సంవత్సరంలో స్వర్ణలత మరణించడం జరిగింది. ఈమె దక్షిణ భారత గాయని.
ఇక చరిత్రలో ఈ నాటి పండగల విషయానికి వస్తే...
ఈ రోజు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు.2008 వ సంవత్సరంలో సెప్టెంబర్ 12 వ తేదీని మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినంగా ప్రకటించడం జరిగింది.
ఇక 1978 వ సంవత్సరంలో సెప్టెంబర్ 12వ తేదీ నాడు ఎఫ్ డి ఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య రక్షణ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది.
ఇక అలాగే ఎఫ్ డి ఐ వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గాడన్ 1854 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించడం జరిగింది.