చాలా మంది కూడా గుండెల్లో మంట, ఎసిడిటి సమస్యలతో సతమతం అవుతూ వుంటారు. అయితే ఉసిరి కాయతో ఈ సమస్యలని చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఉసిరి కాయని ఉపయోగించడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలని ఈజీగా వదిలించుకోవచ్చు. అయితే దీనిని ఎలా వాడాలో తెలుసుకొండి. ఉసిరి పొడి గుండెల్లో మంట ఇంకా అలాగే ఎసిడిటీ సమస్యలకి చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. ఉసిరి కాయ గొప్ప ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇక వీటి అన్నింటికంటే కూడా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిని ప్రతి సీజన్లో కూడా మనం ఉపయోగించవచ్చు. దీనిని తినడం ద్వారా శరీరంలోని చాలా విషపూరిత పదార్థాలు సులభంగా తొలగిపోతాయి. అందువల్ల కొద్ది క్షణాల్లోనే మంచి ఉపశమనం అనేది మీకు కలుగుతుంది.ఇక మీరు ఉసిరి పొడిని తినాలనుకుంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ పొడిని వేసుకోవాలి.ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని బాగా వడపోసి నిదానంగా తాగాలి.
ఇక తాగిన తరువాత కొద్దిసేపట్లోనే మీకు ఛాతీలో మంట ఇంకా కడుపులో వేడి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు కనుక మీరు తీసుకుంటే చాలా సమస్యలు అనేవి పరిష్కారమవుతాయి.అలాగే ఉసిరి పొడిని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. కడుపులో గ్యాస్ సమస్య అనేది శాశ్వతంగా దూరమవుతుంది.ఇక ఇది కాకుండా మీ శరీరం కూడా చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఇక అంతేకాకుండా ప్రతి రోజూ కూడా ఒక ఉసిరికాయను కనుక మీరు తిన్నట్లతే అన్ని రకాల పైత్యాలు ఈజీగా తగ్గుతాయి. కఫం కూడా తగ్గుతుంది.అలాగే మేధస్సు కూడా పెరుగుతుంది. వీర్యపుష్టి అనేది కూడా కలుగుతుంది.ఇంకా శారీరక బలం పెరుగుతుంది. త్రిదోషాలు కూడా నివారించవచ్చు. రోజుకు మూడు ఉసిరికాయల చొప్పున తింటే అన్ని రకాల పైత్యాలు కూడా చాలా సులభంగా తగ్గుతాయి.