ఓమిక్రాన్ టెన్షన్.. ఇంత మంది అనుమానితులు ఉన్నారా..!
నిర్థారణ కాకపోతే బాధితులను ఐసోలేషన్ లో ఉంచుతామని తెలియజేశారు. ఓమిక్రాన్ ఉన్న దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 12 మందికి కరోణ నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. వారికి వచ్చింది కరోణ వారియంట, లేదా సాధారణ కోవిద్ వేరియంట అనే నిర్ధారణకు రావాల్సి ఉంది. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన కరోణ పాజిటివ్ వ్యక్తుల నుంచి శాంపిళ్లను జీవమ్ పరీక్షకు పంపిస్తున్నారు. రిపోర్ట్ వచ్చేవరకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్ తరలిస్తామని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎట్ రిస్కు దేశాలనుంచి వచ్చిన ప్రయాణికులను ప్రత్యేకంగా గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రిలో ఐసొలేట్ చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ నిర్ధారణ అయిన వారి పై ప్రత్యేకమైన వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోణ పాజిటివ్గా తేలిన బ్రిటన్ మహిళ జీవన్ టెస్ట్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఈ పన్నెండు మంది శాంపిల్ అన్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీసీఎంబీకి పంపించారు. కరోణ బారిన పడిన 12 మంది విదేశీ ప్రయాణికుల్లో బ్రిటన్ నుంచి తొమ్మిది మంది, సింగపూర్, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు చొప్పున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చారు.