వయస్సు 30 దాటిందా..ఈ పరీక్షలు చేసుకోవాల్సిందే ?

Veldandi Saikiran
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ ను గడిపేస్తున్నారు. ఒకరితో ఒకరు సంబంధం లేకుండా... జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఆరోగ్యo పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని కారణంగా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన మహిళల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి 30 సంవత్సరాలు దాటిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే... కొన్ని ఆరోగ్య సూచనల పాటిస్తే... అన్ని ఆనారోగ్యాలకు చెక్‌ పెట్టవచ్చు.
30 సంవత్సరాలు దాటిన మహిళలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కంప్లీట్ బ్లడ్ కౌంట్ : కంప్లీట్ బ్లడ్ కౌంట్... దీన్ని సిబిసి టెస్ట్ కూడా అంటారు. ఈ పరీక్ష చేసుకోవడం కారణంగా వైట్ బ్లడ్ సెల్స్ మరియు రెడ్ బ్లడ్ సెల్స్ మనకు తెలుస్తోంది. అలాగే రక్తహీనత మరియు రక్త క్యాన్సర్ వస్తుందా లేదా అనే విషయాలు కూడా మనకు ఈ రిపోర్టు ద్వారా తెలుస్తాయి. ముఖ్యంగా మహిళలు రక్తహీనత అనేది ఎప్పటినుంచో సమస్య. కాబట్టి మహిళలు ఖచ్చితంగా కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేసుకోవాలి.
లిపిడ్ ప్రొఫైల్ : లిపిడ్ ప్రొఫైల్ అనేది మహిళలకు చాలా ముఖ్యమైనవి. ఈ టెస్ట్ ద్వారా శరీరంలో కొవ్వు శాతం ఏ మేరకు ఉంది అనేదానిపై మనకు సమాచారం తెలుస్తుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చును.  హాట్ స్ట్రోక్ మరియు గుండె ఆరోగ్యం వంటి సమస్యలను తొందరగా మనం గుర్తించవచ్చు.
థైరాయిడ్ ; ప్రస్తుత కాలంలో షుగర్ బీపీ ల తో పాటు థైరాయిడ్ కూడా అందరిని వేధిస్తోంది. ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్య మహిళలను ఇబ్బంది పెడుతోంది. పది మంది మహిళలు ఉంటే అందులో ఒక్కరికి కచ్చితంగా థైరాయిడ్ ఎలా ఉంటుంది. నెలసరి సరిగా లేకపోవడం మరియు బరువు తగ్గడం, హెయిర్ ఫాల్ మరియు సంతాన సమస్యలు ఈ థైరాయిడ్  కారణంగా వస్తాయి.  కాబట్టి ప్రతి ఒక్క మహిళ థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి.
రక్తంలో చక్కెర : 35 సంవత్సరాలు దాటిన మహిళలు ఎక్కువగా షుగర్ వ్యాధి బారిన పడతారు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా అనే ఈ షుగర్ వ్యాధి వస్తుంది. కాబట్టి 35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: