ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మన దరిచేరదు..!
ప్రస్తుతం కరోనా దేశం అంతటా వ్యాపించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాలు ఈ వైరస్ ను నివారించేందుకు తగినంత ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీని కారణంగానే దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాయి ప్రభుత్వాలు . అయితే కరోనాను నివారించేందుకు, మన దగ్గర కొన్ని చిట్కాలు ఉన్నాయి.
1). రాత్రిపూట మనం ఆహారం తీసుకునేటప్పుడు పెరుగు తీసుకోకూడదు.
2). ఉదయం లేవగానే టీ తాగేటప్పుడు అందులో లవంగాన్ని వేసుకొని తాగడం వల్ల కరోనాను రాకుండా అడ్డుకోవచ్చు.
3). అప్పుడప్పుడు ఇంట్లో కర్పూరం, సాంబ్రాణి , దూపం వంటి వాటితో పొగ వేయడం వల్ల కరోనాను దరిచేరనివ్వదు.
4). ఉసిరికాయ ని ఏదైనా పచ్చడి రూపంలో ఆహారంలో తీసుకోవడం వల్ల కరోనా సోకకుండా ఉంటుంది.
5). మనము చేసుకునే ప్రతిరోజు కూరలలో అర స్పూన్ సొంటి, అల్లాన్ని వేసుకోవడం వల్ల కరోనా సోకకుండా ఉంటుంది.
6). ప్రతిరోజు మనమీద సూర్యరశ్మి కిరణాలు కనీసం రెండు గంటలపాటు పడేవిధంగా చూసుకోవాలి.
7). మనము ప్రతి రోజు ఏదో ఒక ఆహారాన్ని తింటూనే ఉండాలి.
8). ముక్కులో ఆవ గింజల నూనె వేసుకోవడం వలన కరోనా ను ధరిచేరనివ్వదు.
9). ఎక్కువగా ఏసి వాడటం కూడా మంచిది కాదు. అందుకే ఎంత వీలైతే అంత తగ్గిస్తే మంచిది.
10). ఈ సమయంలో పూజలు , వ్రతాలు అని ఉపవాసాలు వంటివి చేయకూడదు.
11). మనము ప్రతి రోజు వేడి నీటిని తాగడం, అదేవిధంగా గొంతును తడిగా ఉంచడం వలన కరోనా సోకకుండా ఉండవచ్చు.
12). తేనె, నిమ్మరసాన్ని కలుపుకొని తాగడం వలన కరోనా సోకకుండా ఉండవచ్చు.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించి కరోనా ను మన దరి చేరని ఇవ్వకుండా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పబడిన సులభమైన చిట్కాలను పాటించి ఆరోగ్యవంతులుగా ఉండండి.. అలాగే వీటన్నింటినీ తీసుకుంటూనే మరొకవైపు మాస్క్ లను తప్పకుండా ఉపయోగించండి.