మగువలకు భారీ షాక్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

Satvika
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, బంగారం నిల్వలు, డిమాండ్ వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి.తాజాగా ద్రవ్యోల్బణం కూడా బంగారం ధర పెరగుదల, తగ్గుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం అధికంగా ఉంటుంది. నిత్యం జ్యుయలరీ షాపులు సీజన్ తో సంబంధం లేకుండా కిటకిటలాడి పోతుంటాయి. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది..పది గ్రాములపై రూ.600 లు బంగారం ధర పెరగగా, వెండి కిలోకు వెయ్యి రూపాయల చొప్పున పెరిగింది.


ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో రూ.600 పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.48,350 కి చేరింది.చెన్నైలో బంగారంపై రూ.620 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,420 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,820 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,750గా ఉంది.విశాఖపట్నం, తిరుపతిలో రూ.650 మేర ఎగబాకడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,350 అయింది..


ఈరోజు బంగారం పెరిగితే..వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,000 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.67,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, చెన్నైలో రూ.67,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.62,000 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.67,000 ఉంది. ఇక కేరళలో రూ.67,000 వద్ద కొనసాగుతోంది.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: