సివిల్స్ సర్వీసెస్ మెయిన్స్ 2018 ఫలితాలు విడుదల!

Edari Rama Krishna
సివిల్స్ సర్వీసెస్ మెయిన్స్ 2018 ఫలితాలు గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్సి) ఫలితాలను విడుదల చేసింది. కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం 1994 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

అభ్యర్థులు ఈ ఫలితాలను సంబంధిత వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించి జనవరి 9 నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఏడాది జూన్ 3వ తేదీన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: