ప్రపంచంలో వరుసగా తీవ్ర పరిణామాలు..?

వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే…తొలిసారి తగిలిన గాయాన్ని మర్చిపోతాం. అలాగే రాజకీయ నాయకులు కూడా తాము ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించడానికి ఏదో ఒక అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువస్తారు. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ పైనే నడుస్తోంది. ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. అయితే అక్కడ ప్రస్తుతం అరాచకం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. వెయ్యి మందికి పైగా ఖైదీలను వదిలిపెట్టడంతో అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. అక్కడ సివిల్ వార్ జరుగుతోంది. ప్రజా తిరుగుబాటు నడుస్తోంది. అధికార పార్టీ అండతో ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. బ్రిటన్ జనానికి భద్రత కరవైంది. ప్రస్తుతం అక్కడి వారు తల్లడిల్లిపోతున్నారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో కూడా తీవ్ర అల్లర్లు జరుగుతున్నాయి. అక్కడి నిరసనల్లో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ వారితో కమ్యునికేట్ అవ్వలేకపోతున్నామని బంగ్లాదేశీయులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కానీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పై జరిగిన దాడితో ఈ రెండు అంశాలు పక్కకి వెళ్లిపోయాయి. ప్రపంచం అంతా కూడా దానిపైనే చర్చ జరిగింది. ఈ అంశం కాస్త మరుగున పడుతున్న సమయంలో మైక్రో సాఫ్ట్ ఆగిపోవడం.. ప్రజలు ఇబ్బందులు పడటం జరిగిపోయింది.

వీటన్నింటి మధ్య స్పేస్ ఎక్స్ వ్యవహారం, సునీతా విలియమ్స్ గురించి మన వాళ్లు మాట్లాడటమే మర్చిపోయారు. ఒక అంశానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అంతే తీవ్రతతో ఉన్న మరో అంశం మరుగున పడిపోతుది. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్ష పదవి నుంచి బైడెన్ తప్పుకోవడంతో మళ్లీ ఇప్పుడు అంతా దీని గురించే చెప్పుకుంటూ ఉంటారు.  ఈ సమస్యలకు పరిష్కారం దొరక్క ముందే వాటిని పక్కన పడేసి బ్రేకింగ్ కోసం ఆరాట పడుతున్నారు. దీంతో ప్రజా సమస్యలు,  వారికి అవసరం అయిన అంశాల గురించి చర్చలు జరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: