చంద్రబాబు స్టేలపై సుప్రీంకోర్టు తీర్పు సంచలనం?

కోర్టుల్లో  స్టేలపై సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెల్లడించింది. ఇది చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులకు ఊరట కలిగించే అంశం.  సివిల్, క్రిమినల్ కేసుల్లో ట్రయిల్ కోర్టులు, హైకోర్టులు జారీ చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దు కావని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.

2018లో ఆసియన్ రిసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సీబీఐ కేసులో ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం, నిర్దిష్ట గడువు ప్రస్తావించకుండా ఉంటే ఆరు నెలల తర్వాత కోర్టులు జారీ చేసిన స్టేలు వాటంతట అవే రద్దు అవుతాయి అని తీర్పు చెప్పింది. తర్వాత ఈ తీర్పు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసే స్టే ఉత్తర్వులకు వర్తించదని సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది.

2018 తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో జస్టిస్ ఎ.ఎస్.ఓకా, జస్టిస్ జే.బి.పార్టీవాలా, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా లు ఉన్నారు. వాదోపవాదనలు విన్న ఈ ధర్మాసనం తన తీర్పును గత ఏడాది డిసెంబరు 13న రిజర్వ్ లో ఉంచింది. తాజాగా ఈ తీర్పును ప్రకటించింది.

ఇందులో సీజేఐ, జస్టిస్ పార్దీవాల, జస్టిస్ మనోజ్ మిశ్రా, తరఫున జస్టిస్ ఎ.ఎస్.ఓకా ఒక తీర్పు, జస్టిస్ పంకజ్ మిట్టల్ మరో తీర్పు రాశారు. రెండు తీర్పులు దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. 2018 తీర్పును వ్యతిరేకించాయి. రాజ్యాంగంలని అధికరణ 142 కింద సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న అధికారాలపైన ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అధికరణ పేరిట హైకోర్టు జారీ చేసే మధ్యంతర ఉత్తర్వులు  ఆరు నెలల మాత్రమే చెల్లుబాటు అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొనడం సమంజసం కాదని స్పష్టం చేసింది. హైకోర్టుకు పరిమితులు విధించడం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: