వైసీపీలో ఇంత పెద్ద హ‌డావిడా... అంద‌రిలోనూ ఒక్క‌టే టెన్ష‌న్‌..!

VUYYURU SUBHASH
వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు దాటిపోయింది. రాష్ట్రంలోని కీల‌క ప్రాజెక్టులు కొద్దిగా అంటే కొద్దిగానే ముందుకు సాగుతున్నాయి. దీంతో ప్రారంభోత్స‌వాలు.. శంకుస్థాప‌న‌లు వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం లేదు. మ‌రోవైపు.. నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. కేవ‌లం ప్ర‌జ‌ల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయ‌డంపైనే ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని ఏళ్ల త‌ర‌బ‌డి.. అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రావ‌డంతో అంద‌రిలోనూ ఒక్క‌సారిగా టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు.. ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని.. ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు.

మ‌రోవైపు.. ఎన్నికై.. రెండు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే .. తాము ఇచ్చిన హామీల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తార‌నే భ‌యం నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌జల్లోనే ఉండాలంటూ.. ఎమ్మెల్యేల‌ను రోజుకోసారి చెబుతోంది. వెళ్ల‌క‌పోతే.. తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని అంటున్నారు. దీంతో నాయ‌కులు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేదు.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. వాటిని నిల‌దీసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న నాయ‌కులు.. కొన్ని చోట్ల‌.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సాధార‌ణంగా.. ఏప‌నినైనా.. ప్రాజెక్టునైనా.. ప్రారంభించిన త‌ర్వాత‌.. లేక‌.. ప్రారంభించ‌బోయే ముందో.. శిలాఫ‌ల‌కాలు ఏర్పాటు చేస్తారు. ప్రారంభించిన త‌ర్వాత‌.. వాటిలో పేర్లు రాసుకుంటారు. అయితే.. ఇప్పుడు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం, క‌ర్నూలు వంటి జిల్లాల్లో నాయ‌కులు చిత్ర‌మైన ప‌నులు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో కీల‌క‌మైన వాటిని.. ముఖ్యంగా ఆయా ప‌నులు చేపట్టినా.. కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని భావించే వాటిని తెర‌మీదికి తెస్తున్నారు. వాటికి `త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభించ‌బ‌డును` అని పేర్కొంటూ.. శిలా ఫ‌ల‌కాల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అంటే.. ఆయా ప‌నుల‌ను ఇప్పుడు ప్రారంభించ‌రు. కానీ, ప్రారంభిస్తున్న‌ట్టు శిలాఫ‌ల‌కాలు వేస్తారు. అంటే.. తాము ఇచ్చిన హామీల విష‌యంలో ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తే.. వీటిని చూపించి.. కొంత మేర‌కు వారి ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చాల‌నే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఈ నాలుగు జిల్లాల్లో సుమారు 25 ప‌నులకు సంబంధించి గుట్టు చ‌ప్పుడు కాకుండా.. నాయ‌కులు శిలా ఫ‌ల‌కాలు సిద్ధం చేయిస్తున్నారు. త్వ‌ర‌లోనే జ‌నంలోకి వెళ్లి.. వీటిని చూపించాల‌ని.. అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: