కరోనా సమయంలో ఇండియాపై అంత కుట్ర జరిగిందా?
అయితే వీటికి పోటీగా మన దేశం సొంతంగా కోవిషిల్డ్, కోవాక్సిన్ టీకాలను కనిపెట్టింది. కానీ వీటిని బయటకు రాకుండా అనేక దేశాలు కుట్రలు పన్నాయి. అమెరికా, యూరప్ దేశాలు తమ దేశాల్లో మన వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వకుండా చాలా రోజులు తాత్సారం చేశారు. నెలల తరబడి తమ దేశంలోకి రాకుండా ఆపుతూ వచ్చారు. ఈ లోపు మన దేశంలో వీటిని విజయవంతంగా వాడేశాం.
దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకాలను అందించగలిగాం. కోవిడ్ వ్యాక్సిన్ ను ఇతర దేశాలు వ్యాపారంలాగా చూసి రూ.కోట్లు దండుకుంటే.. ఇండియాలో మాత్రం కొన్ని కోట్ల మందికి నరేంద్ర మోదీ సర్కారు ఉచితంగా టీకాలను అందించింది. పైగా అంతర్జాతీయంగా వీటికి అనుమతులు రాకుండా చేసిన పలు దేశాలు.. సైడ్ ఎఫెక్స్ట్ ఉన్నాయని అపోహలు సృష్టించింది.
తాజాగా ఈ వ్యాక్సిన్లపై మరో కుట్ర కోణం బట్టబయలైంది. మన దేశీ వ్యాక్సిన్లను ఎందుకు వాళ్లు ఆపారు అంటే.. ఫైజర్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్లను అమ్ముకోవడానికే అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మన టీకాలు అక్కడ విక్రయిస్తే వారికి నష్టం వస్తుందనే ఉద్దేశంతో కావాలనే మన వాటిని అడ్డుకున్నారు. యూరోపియన్ ముఖ్య రాలైన ఉర్సులినా వండర్ లిన్ ఇందులో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు తాజాగా వెలుగు చూస్తున్నాయి. ఆమె భర్త జర్మన్ కావడంతో పాటు ఫైజర్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు. అందువల్లం ఆ కంపెనీ నుంచి ఒక్కొక్క మనిషికి సుమారు పదేసి వ్యాక్సిన్లకు సరిపడా డబ్బులను ముందుగా చెల్లించారన్న కుంభకోణం ఇప్పుడు బయటకు వచ్చింది.