ప్రేమ పెళ్లి.. కానీ విధి చిన్నచూపు చూసింది.. చివరికి ఒక్కరోజు ముందు?

praveen
విధి ఆడిన వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే అని ఎంతోమంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు పెద్దలు అలాగే చెబుతూ ఉంటారు. వారి చాదస్తం కాకపోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అని అంటూ ఉంటారు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత నిజమే పెద్దలు చెప్పింది ముమ్మాటికి నిజమే అని ఒప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో.. కొంతమంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతూ ఉంటాయి. సంతోషంగా గడిచిపోతున్న జీవితాన్ని మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉంటుంది విధి. ఏకంగా కుటుంబంలో విషాదాన్ని నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇలాంటి తరహా ఘటనలు కొన్ని కొన్ని సార్లు ఏకంగా అందరి మనసును కలిసి వేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ప్రేమను గెలిపించుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ ఇక్కడ ఒక యువకుడు ఇది సాధించాడు. ఏకంగా ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. కానీ అతని ఆనందాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. దీంతో పెళ్లికి ఒక్కరోజు ముందే అతన్ని మృతి ఒడిలోకి చేర్చింది.

 ఈ విషాదకర ఘటన తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులో ఉంటున్న శంకర్ నిజాంబాద్ కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఇక చివరికి తమ ప్రేమను పెద్దలకు చెప్పి వారిని అతి కష్టం మీద ఒప్పించారు. కాగా ఈనెల 20వ తేదీన పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాను అనే ఆనందం మనసులో ఉప్పొంగిపోతుంది. కాగా ఇటీవల అమ్మాయిని సిటీలో బస్సు ఎక్కించి అతను బైక్ పై ఇంటికి బయలుదేరాడు. కందుకూరు వద్ద కారు అతని బైక్ ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే రూట్లో వస్తున్న యువతి బస్సు దిగి అతని ఆసుపత్రికి తరలించగా.. ఇక చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ యువతి అరణ్యరోధనగ విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: