కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలో కొడుకును చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా?

praveen
ఈ భూమి మీద ఎన్నో కోట్ల జీవరాసులు ఉన్నప్పటికీ.. ఇక మనిషి మాత్రం అన్ని జీవరాత్రుల్లోకెల్లా ఎంతో ప్రత్యేకం అని అంటూ ఉంటారు. ఎందుకంటే జంతువులతో పోల్చి చూస్తే మనిషిలో విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి అనేది అవగాహన ఉంటుంది. ఇక పరిస్థితులకు తగ్గట్లుగానే మనిషి మసులుకుంటూ ఉంటాడు. అంతేకాదు సాటి మనిషికి సహాయం చేయాలి అనే మానవత్వం కూడా మనిషిలో ఉంటుంది. కానీ నేటి రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. మనిషి అడవుల్లో ఉండే మృగం కంటే అత్యంత ప్రమాదకరంగా మారిపోతున్నాడు.

 ఏకంగా సాటి మనుషులకు సహాయం చేయడం విషయం పక్కనపెడితే.. దారుణంగా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకడుగు వేయని పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది. మొన్నటి వరకు ఏకంగా పరాయి వ్యక్తుల మీద ఇలా దాడికి పాల్పడి ప్రాణాలు తీసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ అనేదే చూపించడం లేదు. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. కొడుకుకి పెళ్లి అవుతుంది అంటే తండ్రి ఆనందం పట్టలేని విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఓ తండ్రి మరికొన్ని గంటల్లో కొడుకుకి పెళ్లి కావాల్సి ఉండగా.. అంతలోనే కొడుకును చంపేశాడు.

 ఈ దారుణమైన ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘల్ కు మరికొన్ని గంటల్లో పెళ్లి కావాల్సి ఉంది. అయితే బంధువులు ఊరేగింపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదే సమయంలో సింఘల్ కు తండ్రితో ఏదో విషయంపై చిన్న గొడవ జరిగింది. అయితే ఆవేశంలో అతడిని తండ్రి ఏకంగా 15 సార్లు కత్తితో పొడిచి చంపేసాడు. అయితే అప్పటికే ఊరేగింపు కోసం ఏర్పాటు చేసుకున్న బంధువులు.. వరుడు కోసం ఇల్లంతా వెతకగా ఏకంగా రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక ప్రస్తుతం రంగాలాల్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: