చనిపోయిందని అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే.. లేచి కూర్చుంది?

praveen
సాధారణంగా ఒక్కసారి మరణించిన వ్యక్తి మళ్ళీ బ్రతకడం అంటే అది అసాధ్యం అని చెప్పాలి. కానీ ఎవరినైనా ఇలా చనిపోయిన వారు బ్రతుకుతారా అంటే అయ్యో ఎందుకు బ్రతకరు మేము ఎన్నిసార్లు చూడలేదు అని సమాధానం చెబుతారు ఎవరైనా సరే.. అదేంటి అని అడిగితే సినిమాలలో చాలాసార్లు చూశాం  అని చెబుతారు.  కానీ సినిమాలలో కాదు నిజ జీవితంలో ఇలాంటిది ఎప్పుడైనా చూసారా అంటే అందరూ చూడలేదు అని చెబుతారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా సినిమాలకు మించిన ఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. ఏకంగా చనిపోయారు అని డాక్టర్ నిర్ధారించిన  వారు సైతం మళ్లీ ప్రాణం పోసుకుంటున్నారు.

 అచ్చంగా  దెయ్యం సినిమాలో చూపించినట్లుగానే ఏకంగా చనిపోయిన వారు మళ్ళీ మాట్లాడటం మొదలుపెడుతున్నారు. ఇలాంటి తరహా ఘటనలతో ఏకంగా డాక్టర్లు సైతం అవాక్కవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి ఘటన గురించే. ఏకంగా డాక్టర్లు ఆమెను పరీక్షించి చనిపోయింది చెప్పేశారు. దీంతో ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె చనిపోయిన బాధలో ఏడవటం మొదలుపెట్టారు. కానీ అంతలో ఎవరు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది  చనిపోయింది అనుకున్న ఆమె మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది.

 ఏకంగా ఒక్కసారిగా లేచి కూర్చుంది. దీంతో ఇక అక్కడున్న కుటుంబ సభ్యులకు ఆమె అలా ఎందుకు లేచింది అని అర్థం కాక భయపడాలా.. ఏకంగా చనిపోయింది అనుకున్న మహిళ బ్రతికినందుకు సంతోష పడాల కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన యూపీలోని హమీర్పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సదర్ గ్రామానికి చెందిన 33 ఏళ్ల అనిత క్యాన్సర్ తో బాధపడుతుంది. ఇటీవల చికిత్స తీసుకుంటుండగా ఇక చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక అంత్యక్రియల కోసం ఆమెను అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: