500 కొడితే రూ.లు 2500.. ఏటీఎంకు ఎగబడ్డ జనం?

praveen
ఇటీవలి కాలంలో ఏటీఎం వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని బ్యాంకులు కూడా ప్రతి చోట ఎటిఎం సెంటర్లు పెడుతూ ఉన్నాయ్. ఈ క్రమంలోనే అన్ని బ్యాంకుల కస్టమర్లు కూడా ఏటీఎం లోకి వెళ్లి నగదు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఏటీఎంలలో నగదు తీసుకోవడానికి వెళ్ళిన సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఎన్ని డబ్బులు కావాలని  ఏటీఎం కు సందేశం ఇస్తే మనకు అన్ని డబ్బులు విత్ డ్రా అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఏటీఎంలో 500 రూపాయలు కొడితే 2500 రూపాయలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత జనాలు ఊరుకుంటారా ఏటీఎం లో మనీ విత్ డ్రా చేసుకోవడానికి పరుగులు తీస్తున్నారు.

 మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కాపర్ ఖేడా పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో ఘటన వెలుగు చూసింది. ఇటీవలే సదరు ఏటీఎం లోకి వెళ్ళిన ఒక వ్యక్తి 500 విడుదల చేసేందుకు ప్రయత్నించాడు. అయితే 500 ఎంటర్ చేసిన తర్వాత ఐదు వందలు విలువైన ఐదు కరెన్సీ నోట్లు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మరోసారి అదే విధంగా ట్రై చేస్తే ఇంకోసారి కూడా 2500 రూపాయలు వచ్చాయి. దీంతో స్థానికంగా ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అందరూ కూడా నగదు విత్ డ్రా చేసుకునేందుకు సదరు ఏటీఎం వరకు బారులు తీరారు.

 కొంతమంది పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందికి ఇక అక్కడ జరిగిన విషయాన్ని వివరించి సమాచారం అందించారు. అయితే ఇలా ₹500 కొడితే 2500 రావడానికి కారణం కూడా లేకపోలేదు. వంద రూపాయల విలువైన నోట్లను ఉంచాల్సిన ట్రే లో 500 రూపాయల నోట్లను తప్పుగా జమ చేయ డంతో ఇలా జరిగిందని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇక ఏర్పడిన సాంకేతిక సమస్యలు పరిష్కరించి ఆ తర్వాత వినియోగదారులకు ఏటీఎం  అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Atm

సంబంధిత వార్తలు: