ప్రేమ పెళ్లి.. కానీ రెండు రోజులకే?

praveen
సాధారణంగా ఎంతోమంది ప్రేమ జంటల విషయంలో పెద్దలు విలన్లుగా మారిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది ప్రేమను గెలిపించుకోలేక పోయామె అనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొంత మంది పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్న ప్రేమ జంటలపై సొంత  తల్లిదండ్రులే కక్షగట్టి ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. లేదా పెళ్లి చేసుకున్నా వారిని సైతం విడదీస్తూ ఉండడంతో వారి ఆత్మహత్యలకు కూడా కారణమవుతున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 రెండేళ్ల పాటు ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అని నిర్ణయించుకున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేశారు. కాని పెద్దలు మాత్రం వారికి పెళ్లి చేసేందుకు ససేమిరా అన్నారు. చివరికి పెద్దలను ఎదిరించి పోలీసుల సహాయంతో ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. కానీ చివరికి పెద్దలు వచ్చి విడదీశారు. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.  అభిషేక్ చోళనహళ్ళికి చెందిన అనన్య ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుని వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా పెద్దలు మాత్రం వ్యతిరేకించారు. మేజర్లు కావడంతో పోలీసులను సంప్రదించి ఒక గుడిలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఇక ఈ కొత్త జంట ఒక కేఫ్ ఉన్న సమయంలో అనన్య తల్లిదండ్రులు బంధువులు ఇక ఈ జంట పై దాడి చేసి దారుణంగా కొట్టారు. అనన్యను బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇద్దరూ మేజర్లు కావడంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునేందుకు అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక అనన్య తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇక వారి అంగీకారంతోనే ఈ ప్రేమ జంటను కలపాలని పోలీసులు భావిస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: