శివరాత్రికి ఉపవాసం ఉండలేదని.. భార్యను చంపేశాడు?

praveen
సాధారణంగా శివరాత్రి వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసదీక్ష పూనుకుంటారు అన్న విషయం తెలిసిందే. శివరాత్రి రోజున ఉపవాసం చేస్తే ఎంతో శుభం కలుగుతుంది అని ప్రతి ఒక్కరు విశ్వసిస్తుంటారు.  చిన్నల నుంచి పెద్దల వరకు శివరాత్రి రోజున ఉపవాస దీక్షను చేపడుతూ ఉంటారు అని చెప్పాలి. కేవలం ఉపవాసం  చేయడం మాత్రమే కాదు రాత్రంతా జాగరణ చేస్తూ శివనామస్మరణ మధ్యే దేవుని కొలుస్తూ వుంటారు.  శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపవాసదీక్ష చేయాలన్న నియమం మాత్రం లేదు. ఎవరి ఇష్టం ప్రకారం వారు అటు శివునికి ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు.


 కానీ ఇక్కడ శివరాత్రి రోజున ఉపవాస దీక్ష పూనుకోకపోవడమే ఆ మహిళల పాలిట శాపంగా మారింది. ఉపవాసం ఎందుకు ఉండలేదు అంటూ గొడవ పెట్టుకున్న భర్త చివరికి భార్యను దారుణంగా హతమార్చాడు. శ్రీకాకుళం జిల్లా రూరల్ పరిధిలో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2015 లో నవీన్ కళ్యాణి పెళ్లి జరిగింది. అయితే నవీన్ కు సోదరి అంటే ఎంతో ప్రేమ. ఆమే ఏం చెప్పినా కరెక్ట్ అంటూ చెబుతూ ఉంటాడు. ఇటీవలే నీ భార్యను కూడా ఉపవాసదీక్ష చేయమని చెప్పు అంటూ నవీన్ కి సూచించింది సోదరి. ఇక ఇదే విషయాన్ని భర్త తన భార్యకు చెప్పాడు.


 కానీ తాను మాత్రం ఉపవాసదీక్ష చేయలేను అంటూ తెగేసి చెప్పింది సదరు భార్య. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు భర్త.  అక్క చెప్పిన విధంగా ఉపవాసం ఉంటే నష్టం ఏంటి అంటూ భార్యను నిలదీస్తాడు  ఉపవాసం ఉండటం తనకు ఇష్టం లేదు అంటూ కళ్యాణి చెప్పడంతో.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి ఆగ్రహంతో ఊగిపోయిన నవీన్ భార్య కల్యాణి మొహం పై తల దిండు పెట్టి తన ఊపిరి ఆడకుండా చేసి చివరికి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు నవీన్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: