అర్ధరాత్రి ఆకలేసింది.. సైకోగా మారిన ప్రియుడు.. చివరికి?

praveen
ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోయింది అన్నది అర్థమౌతుంది. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించకుండా దారుణంగా ప్రాణాలు తీసేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సొంత వారి విషయంలో కూడా జాలి చూపించటం లేదు నేటి సమాజంలో ప్రతిక్షణం ప్రతి ఒక్కరు ప్రాణభయంతో బతకాల్సిన దుస్థితి ఏర్పడింది.



 అంతేకాదు చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో సాటి మనుషుల ప్రాణాలను ఏదో చాక్లెట్ తిన్నంత ఈజీగా తీసేస్తున్న ఘటనలు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి అనే చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ప్రేమించిన ప్రియురాలు పైన దారుణంగా దాడి చేసాడు ఇక్కడ ఒక వ్యక్తి. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నరోడా ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడు ప్రియురాలిని ఆహరం కావాలంటూ అడిగాడు. కానీ ఆమె నిరాకరించడంతో చివరికి ప్రాణాలు తీసాడు.


 తేజల్ ఠాగూర్ అనే బాధిత యువతి మాట్లాడుతూ పెళ్లి కాక పోయినా ప్రియుడితో కలిసి ఉంటున్నానని.. అయితే ఇటీవలే అర్ధరాత్రి సమయం లో వచ్చి ఆహారం  కావాలని అడగడంతో ఇక ఆ సమయం లో ఆహారం లేదు చెప్పాను. దీంతో ఇక అతను నాపై కోపం పెంచుకున్నాడు. చివరికి టేబుల్ ఫ్యాన్ తో దారుణం గా కొట్టాడు అంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఒకవేళ పోలీసులకు చెబితే ప్రాణాలు తీస్తాను అంటూ అజయ్ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడంటూ ఫిర్యాదులో పేర్కొంది సదరు యువతి. ఇక యువతి ఫిర్యాదు తో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: