భీమ్లా నాయక్ టికెట్ కోసం.. గొంతు కోసిన యువకుడు?

praveen
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పర్యవేక్షణలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి నుంచి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది అనే చెప్పాలి. అంచనాలకు మించి ప్రస్తుతం థియేటర్లకు అభిమానులను ప్రేక్షకులను రప్పించడంలో సక్సెస్ అవుతుంది భీమ్లా నాయక్ . మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే.


 ఇక పవన్ కళ్యాణ్ కి తగ్గట్లుగా పలు రకాల మార్పులు చేయడం అదే సమయంలో  మాటల మాంత్రికుడు సినిమాకు పవర్ ఫుల్ డైలాగులు రావడంతో ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి అసలు సిసలైన పవర్ ఫుల్ సినిమా కావాలి అని ఎంతగానో ఎదురుచూస్తూ అభిమానులందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా ఉంది అని చెప్పవచ్చు. ఇకపోతే భీమ్లా నాయక్ సినిమాను చూసేందుకు అటు ప్రేక్షకులందరూ థియేటర్లకు తరలి వెళ్తున్నారు.


 ఈ నేపథ్యంలోనే కొన్ని థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ భీమ్లా నాయక్ టికెట్ విషయంలో తలెత్తిన చిన్న గొడవ కారణంగా ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయి గొంతు కోసిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణలోని పాల్వంచలో  వెంకటేశ్వర థియేటర్ లో భీమ్లా నాయక్ టికెట్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో కొత్తగూడెం కు చెందిన మధు అనే వ్యక్తి షరీఫ్ అనే యువకుడు గొంతు కోశాడు. ఇక షరీఫ్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం షరీఫ్ కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: