ఆమె ఓ కానిస్టేబుల్ భార్య.. కానీ ఇలా చేసిందేంటి?
ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక కానిస్టేబుల్ భార్య.. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు.. పోలీస్ భార్య కావడంతో సమాజంలో మంచి గౌరవం కూడా ఇక వారిద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా ఇటీవలే ఒక మగబిడ్డ కూడా పుట్టాడు. కానీ ఆమెకు ఏం కష్టం వచ్చిందో తెలియదు చివరికి పసిగుడ్డును వదిలేసి ప్రాణాలు తీసుకుంది. భర్త గురించే కాదు అభం శుభం తెలియని కూతురు గురించి కూడా ఆలోచించలేదు ఆ మహిళ. తమకూరు కు చెందిన కానిస్టేబుల్ శశిధర్ భార్య లావణ్య ఇలా బలవన్మరణానికి పాల్పడింది.
శశిధర్ లావణ్యకు కేవలం ఏడాదిన్నర క్రితమే పెళ్లి జరిగింది. వీరికి ఆరు నెలల కూతురు కూడా ఉంది ఇక ఇద్దరూ కొడుకు ఉన్నాడు. ఇద్దరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇకపోతే రోజు లాగే శశిధర్ ఉదయం సమయంలో డ్యూటీ కి వెళ్ళాడు. ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తలుపు కొట్టి చూడగా భార్య లావణ్య తలుపు తీయలేదు.. దీంతో కిటికీలోంచి చూడగా ఊరికి వేలాడుతూ కనిపించింది భార్య. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.