పెళ్లి చేసుకుని అలా చేసింది.. భర్త ప్రాణం పోయింది?

praveen
పెళ్లంటే నూరేళ్ల అనుబంధం ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఒకరికి ఒకరు కష్టసుఖాలలో తోడునీడగా ఉండాలి. దాంపత్య బంధంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కలసిమెలసి ఉంటూ జీవితాన్ని గడపాలి. ఇక ఇద్దరి మధ్య ఎక్కడ అనుమానాలకు తావు ఇవ్వకుండా అన్యోన్యంగా ఉండాలి. కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. అన్యోన్యత అనేది కరువైపోతుంది. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి.. అంతేకాదండోయ్ కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వని ఎంతో మంది పరాయి వ్యక్తుల మోజులో పడి రాసలీలలు కొనసాగిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు అని తెలిసినప్పటికీ.. ఇల్లీగల్ ఎఫైర్ కారణంగా కాపురంలో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటున్నాము అని ముందే ఊహించినప్పటికీ.. క్షణకాల సుఖం కోసం ఎంతోమంది పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధానికి తెరలేపుతున్నారు. ఇక ఆ తర్వాత కట్టుకున్న భర్త కంటే పడక సుఖం ఇచ్చిన ప్రియుడే ముఖ్యం అనుకుని దారుణంగా భర్తను హతమార్చిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  ప్రియుడు మోజులో పడి పోయిన భార్య భర్త ఉసురు తీసిన ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని సినీ ఫక్కీలో వెలుగులోకి వచ్చింది.

 పెద్ద ధర్పల్లి గ్రామానికి చెందిన మొద్దు వెంకటయ్య అదే గ్రామానికి చెందిన మాధవిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చాడు. కొంతకాలం వరకు వీరి సంసారం సాఫీగానే సాగిపోయింది. కానీ ఆ తర్వాత నాగర్ కర్నూలు కు చెందిన రమేష్ తో మాధవికి  పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. భర్తకు తెలియకుండా తరచూ ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ వచ్చింది మాధవి. తర్వాత ప్రియుడి మోజులో నిండా మునిగిపోయిన మాధవి భర్త వెంకటయ్యను చంపేయాలని నిర్ణయించుకుంది.. ఇక మాధవి ప్రియుడు రమేష్ అతని మిత్రుడు కుర్మయ్య సాయంతో బైక్ పై వస్తున్న వెంకటయ్య అడ్డగించి చున్నీతో గొంతు బిగించి చంపేశారు. ప్రమాదంలో చనిపోయాడు అంటూ చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు అందరిని అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: